Mahanaadu-Logo-PNG-Large

రాబందుల కంటే హీనంగా జగన్

– ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు 

వినుకొండ , మహానాడు:  శవం కనిపిస్తే రాబందుల కంటే హీనంగా జగన్ ప్రవర్తన ఉందని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. జగన్.. దమ్ముంటే రాజకీయ హత్యలకు సంబంధించిన మూడు వివరాలైనా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తన కుంటుంబ సభ్యుల గురించి జగన్ అసత్యాలు చెప్తున్నాడని ధ్వజమెత్తారు. ఇద్దరు రౌడీలు గొడవ పడితే ఢిల్లీ వెళ్లి గొడవ చేస్తావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబాయ్ హత్య నిందితులు జగన్ భార్యతో ఫోటోలు దిగలేదా అని నిలదీశారు. జగన్తో ఫోటోలు దిగిన వారంతా వివిధ కేసుల్లో నిందితులేనని ఈ లెక్కన జగన్పై ఎన్ని కేసులు పెట్టాలని ప్రశ్నించారు.