చిలకలూరిపేట, మహానాడు: రాజ్యసభ సభ్యులు ఎంపీ విజయసాయిరెడ్డి పత్రికలను, పత్రిక ఆధిపతులను, విలేకరులను దూషించినందుకు నిరసనగా చిలకలూరిపేటలోని వివిధ జర్నలిస్టు సంఘాల నాయకులు నిరసన గళం వినిపించారు. వీరికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ, సీపీఐ, సీపీఎం, లోక్ సత్తా, కాంగ్రెస్ పార్టీ, వివిధ ప్రజా సంఘాల నాయకులు నర్సారావుపేట సెంటర్లో మానవహారంగా ఏర్పడి అరగంటసేపు నిరసన తెలియజేశారు. అనంతరం చిలకలూరిపేట డిప్యూటీ తహసీల్దార్ రవికి నిరసన పత్రాన్ని అందజేశారు.