డ్వాక్రా, అంగన్వాడి, ఆశా ఉద్యోగస్తులతో కేక్ కట్ చేసిన కన్నా

సత్తెనపల్లి పట్టణం రఘురాం నగర్ ప్రజావేదిక నందు తెలుగుదేశం జనసేన బిజెపి అధికారంలోకి వచ్చిన తరుణం మరియు కన్నా లక్ష్మీనారాయణ  సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలిచిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేసిన సత్తెనపల్లి నియోజకవర్గ డ్వాక్రా, అంగన్వాడి, ఆశ వర్కర్లు మరియు మహిళ నాయకులు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.