Mahanaadu-Logo-PNG-Large

సత్తెనపల్లిలో కన్నా ఫణీంద్ర ప్రచారం

ఘనస్వాగతం పలికిన కూటమి శ్రేణులు

సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి పట్టణం 30వ వార్డులో శుక్రవారం సత్తెనపల్లి నియోజకవర్గ యువ నాయకుడు కన్నా ఫణీంద్ర ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆయనకు పట్టణ కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. వార్డు లో ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచి ఎన్నికల మేనిఫెస్టో గురించి వివరించారు. ఈ సందర్భంగా ఫణీంద్ర మాట్లాడుతూ మహాశక్తి పేరుతో తల్లికి వందనం పథకం ద్వారా రూ.15 వేలు బిడ్డలను చదివించేందుకు ఇస్తామన్నారు. ఆడపడుచులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం, రైతులకు ఏడాదికి రూ.20,000 ఆర్థిక సాయం, 20 లక్షల ఉద్యోగాలు, ఇంటింటికి ఉచితంగా రక్షిత తాగునీరు వంటి సంక్షేమ కార్యక్రమాలు మేనిఫెస్టోలో భాగంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని వివరించారు. ఈ ప్రచారంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, పెద్దఎత్తున మహిళలు పాల్గొన్నారు.