Mahanaadu-Logo-PNG-Large

మళ్లీ తిహార్‌ జైలుకు కవిత

జ్యుడీషియల్‌ రిమాండ్‌ పొడిగిస్తూ తీర్పు

ఢిల్లీ మద్యం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ రిమాండ్‌ను మళ్లీ పొడిగించారు. సోమవారంతో కవిత రిమాండ్‌ ముగియడంతో ఆమెను రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా సీబీఐ కేసు లో జూన్‌ 3 వరకు కవిత రిమాండ్‌ను పొడిగిస్తూ జడ్జి కావేరి బవేజా ఉత్తర్వులు జారీ చేశారు. కాగా మద్యం కేసులో కవితను మార్చి 15న హైదరాబాద్‌లో ఆరెస్ట్‌ చేశారు. అనంతరం ఆమెను ఢిల్లీకి తరలించారు. అప్పటి నుంచి ఆమె జ్యుడిషియల్‌ కస్టడీలో కొనసాగుతున్నారు. తీహార్‌ జైలులో ఉంచారు.