టీడీపీ, జనసేన, బీజేపీకి 111`135 స్థానాలు
వైసీపీకి 45`60 స్థానాల్లో గెలుపు అవకాశాలు
పార్లమెంటు స్థానాల్లోనూ కూటమిదే జోరు
టీడీపీ 13`15, జనసేన 2, బీజేపీ 2`4 స్థానాలు
అమరావతి: పోలింగ్ తర్వాత కౌంటింగ్కు ముందు పీపుల్స్ పల్స్ సంస్థ నిర్వ హించిన పోస్ట్ పోల్ సర్వేలో కూటమి అత్యధిక స్థానాలు సాధించి పీఠం ఎక్కబోతోందని వెల్లడిరచింది. సర్వేలో పేర్కొన వివరాల ప్రకారం టీడీపీకి 95-110, జనసేనకు 14-20, బీజేపీకి 2-5 సీట్లు, వైసీపీకి 45- 60 సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి 52 శాతం, వైసీపీకి 44 శాతం, కాంగ్రెస్కు 1 శాతం, ఇతరులకు 3 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లోని 25 పార్లమెంటు స్థానాల్లో టీడీపీ 13-15, జనసేన 2, బీజేపీ 2-4 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. వైసీపీ 3-5 పార్లమెంటు స్థానాలను గెలిచే అవకాశం ఉందని తెలిపింది. కూటమి కి 50-54 శాతం, వైసీపీకి 42-45 శాతం, కాంగ్రెస్కు 1-2 శాతం, ఇతరులకు 3-4 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. కూటమి 111-135 అసెంబ్లీ స్థానాలు, వైసీపీ 45-60 స్థానాలు గెలుపొందే అవకాశం ఉందని వెల్లడిరచింది.
54 శాతం మంది కూటమి వైపే మొగ్గు
ఏపీలో గత ఐదేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వ పాలన పట్ల 48 శాతం తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేయగా 32 శాతం సంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీకి మరోసారి అవకాశం ఇస్తారా అని అడగ్గా 51 శాతం ఇవ్వమని, 42 శాతం ఇస్తామని చెప్పారు. ఈ ఎన్నికల తర్వాత ప్రస్తుత సీఎం జగన్ ముఖ్యమంత్రి కావాలని 38 శాతం, చంద్రబాబు కావాలని 40 శాతం మంది, పవన్కళ్యాణ్ కావాలని 12 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నారని సర్వే వివరాలను బయటపెట్టింది. ప్రధానమంత్రి ఎవరు కావాలని అడిగినప్పుడు నరేంద్రమోదీకి 48 శాతం, రాహుల్ గాంధీకి 38 శాతం మంది మద్దతు తెలిపారు. ఏపీలో ఏ పార్టీ గెలుస్తుందని వ్యక్తిగత అభిప్రాయం కింద అడిగినప్పుడు 54 శాతం మంది కూటమి వైపు, 44 శాతం వైసీపీ వైపు నిలబడ్డారు అని పేర్కొంది. ఏపీ అభివృద్ధికి ఏ పార్టీ అధి కారంలోకి వస్తే బాగుంటుందని ప్రశ్నించగా, 52 శాతం మంది కూటమికి, 41 శాతం మంది వైసీపీ అని చెప్పారని వివరించింది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలపై పీపుల్స్ పల్స్ సంస్థ మే 16 నుంచి 20 వరకు పోస్ట్ పోల్ సర్వే నిర్వ హించింది. సర్వేలో భాగంగా 6,900 శాంపిల్స్ సేకరించింది.