హైదరాబాద్: దేశం దృష్టిని ఆకర్షించిన హైదరాబాద్ లోక్సభ స్థానంలో అనూహ్య ఫలితం వెలువడే అవకాశం ఉందని ఇండియా టుడే యాక్సిస్ మై టుడే తెలిపింది. ఎంఐఎం కంచుకోటలో ఈసారి ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ, బీజేపీ అభ్యర్థి మాధవీలత మధ్య హోరాహోరీ పోరు సాగినట్లు తెలిపింది. మాధవీలతనే గెలుపు వరించే అవకాశం ఉందని ఆ సంస్థ అంచనా వేసింది. మొత్తంగా తెలంగాణలో బీజేపీకి 11-12 సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.