విజయవాడ, మహానాడు: నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్పిల్ (నారెడ్కో) సెంట్రల్ జోన్ అధ్యక్షుడిగా మాలక్ష్మి గ్రూపు సీఈవో సందీప్ మండవ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేంద్ర ప్రభుత్వ గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వీయ నియం త్రణ కలిగిన సంస్థగా స్థిరాస్తి రంగంలో నారెడ్కో సేవలు అంది స్తోంది. ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, భీమవరం, కాకినాడ, కోనసీ మ జిల్లాల పరిధికి సెంట్రల్ జోన్ నేతృత్వం వహిస్తోంది. వివిధ దశలలో జరిగిన చర్చల అనంతరం జరిగిన ఎన్నికల ప్రక్రియలో కార్యవర్గం మొత్తం ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికా రి కోనేరు రాజా తెలిపారు. గౌరవ చైర్మన్గా గద్దె రాజలింగం వ్యవహరించనున్నారు. కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా ఎం. రాంబాబు, ప్రధాన కార్యదర్శిగా సాదినేని వెంకట రమణ, కోశాధికారిగా పోట్ల వెంకటకృష్ణ, ఉపాధ్యక్షులుగా ఎం.గణేష్ కుమార్, జి.హరిప్రసాదరెడ్డి, కార్యదర్శులుగా సిహెచ్.శరత్ కుమార్, పి.రాజకుమార్ వ్యవహరించనున్నారు. కార్యవర్గ సభ్యులుగా శ్రీనివాసరావు, శ్రీనివాస్ మెహర్, సురేష్, శ్రీనివా స్, కృష్ణ కిషోర్, వేణుమాధవ్, చైతన్య ఎన్నికయ్యారు. ఈ సం దర్భంగా సందీప్ మండవ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల సమన్వయంతో స్థిరాస్తి రంగ పురోగతికి ప్రయత్నిస్తామ న్నారు. వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించే క్రమం లో అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.