ఎన్టీఆర్‌ ఫౌండేషన్‌కు మన్నవ రూ.2 కోట్ల విరాళం

టీడీపీ అధినేత చంద్రబాబుకు చెక్కు అందజేత

అమరావతి : ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ అనుబంధ విభాగమైన ఎన్టీఆర్‌ ఫౌండేషన్‌కు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహన్‌కృష్ణ రూ.2 కోట్లను విరాళంగా అందించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును సోమవారం ఉండవల్లి నివాసంలో కలిసి చెక్కు అందించారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఎన్నో సేవా కార్యక్ర మాలు నిర్వహిస్తోందని, ఎంతోమంది పేద విద్యార్థులను చదివిస్తున్నారన్నారని మోహన్‌కృష్ణ ప్రశంసించారు. అనంతరం మోహన్‌కృష్ణను చంద్రబాబు అభినందిం చారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐ టీడీపీ అధ్యక్షుడు వేమూరి రవి, ఎన్‌ఆర్‌ఐ గొట్టిపాటి శ్రీధర్‌, తదితరులు పాల్గొన్నారు.