Mahanaadu-Logo-PNG-Large

గుర్తుండిపోయే విజయవాడ రోడ్ షో

– మోదీ ట్వీట్

విజయవాడలో ప్రధాని మోదీ రోడ్ షో ముగిసింది. టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ విజయవాడలో చేసిన రోడ్ షో గుర్తుండిపోతుందని ప్రధాని ట్వీట్ చేశారు. గత కొన్ని రోజులుగా ఏపీలో పర్యటించిన తర్వాత ప్రజలు ఎన్డీఏకు ఓటు వేస్తారని విశ్వసిస్తున్నట్లు మోదీ తెలిపారు. మహిళలు, యువ ఓటర్లు తమకు మద్దతుగా నిలుస్తున్నారని చెప్పారు.