కడప, మహానాడు : కడప నగరానికి చెందిన పలువురు వైసీపీ మాజీ కార్పొరేటర్లు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో గురువారం మదనపల్లిలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో 1వ డివిజన్ మాజీ కార్పొరేటర్ చైతన్య, 31వ డివిజన్ మాజీ కార్పొరేటర్ సురేష్, 44వ డివిజన్ మెస్ రాజశేఖర్, 20వ డివిజన్ మాజీ కార్పొరేటర్ లక్ష్మీదేవి సోదరుడు కృష్ణలు ఉన్నారు.