‘అమరావతి’కి మంత్రి మండిపల్లి రూ. 3 లక్షల విరాళం

అమరావతి, మహానాడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రూ. ₹3,01,116 ల విరాళాన్ని అందజేశారు. ఆ చెక్కును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి సోమవారం సచివాలయంలో అందజేశారు.