Mahanaadu-Logo-PNG-Large

విద్యార్థి మృతి పట్ల మంత్రి నారాయణ విచారం

అమరావతి, మహానాడు: నెల్లూరులోని కెఎన్నార్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి మృతి పట్ల మంత్రి నారాయణ విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  పాఠశాలలో గోడ కూలి తొమ్మిదో తరగతి చదువుతున్న గురు మహేంద్ర(14) అనే విద్యార్థి మృతి చెందడం బాధాకరమన్నారు. ఈ ఘటనపై విచారణకు నెల్లూరు జిల్లా డీఈవోకు ఆదేశించారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరపున అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల పరిహారం మంత్రి నారాయణ ప్రకటించారు.