సమాచార శాఖలో నిధుల దుర్వినియోగం

కమిషనర్‌పై స్టేషన్‌లో ఫిర్యాదు

నంద్యాల: గత ప్రభుత్వ హయాంలో నిధులను పక్కదారి పట్టించారన్న ఆరోపణ లపై సమాచార శాఖ కమిషనర్‌ విజయ్‌కుమార్‌ రెడ్డిపై నంద్యాల టూటౌన్‌ పోలీసుస్టేషన్లో సీనియర్‌ పాత్రికేయుడు చలం బాబు ఫిర్యాదు చేశారు. సీఐ రాజారెడ్డి ఫిర్యాదును స్వీకరించారు. ఎస్పీ దృష్టికి తీసుకుని వెళ్లి కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చారు.