– 40 క్వింటాళ్ళ బియ్యం, కందిపప్పు, పామాయిల్ సేకరణ
బొల్లాపల్లి, మహానాడు: విజయవాడ వరద బాధితుల సహాయార్థం తెలుగుదేశం పార్టీ(టీడీపీ) సీనియర్ నాయకుడు, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సర్వం కోల్పోయి ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న బాధితులకు తన శివశక్తి బయో టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీ, శివశక్తి ఫౌండేషన్ ద్వారా రూ. 25 లక్షలు సాయం అందిస్తామన్నారు. త్వరలోనే సీఎం చంద్రబాబును కలిసి ఈ ఆర్థిక సాయాన్ని చెక్కు రూపంలో సీఎం సహాయ నిధికి అందిస్తామని వెల్లడించారు.
బొల్లాపల్లి మండల నేతల విరాళాల సేకరణ
పార్టీ బొల్లాపల్లి మండల నాయకులు విరాళాలు సేకరించి నిత్యావసర సరుకులు కొనుగోలు చేశారు. ఆ సరుకుల వాహనాన్ని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. వినుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నుంచి వాహనాలను విజయవాడకు పంపించారు. బొల్లాపల్లి, మూగచింతలపాలెం, మాలపాడు, గంగులపాలెం గ్రామాల నుంచి విరాళాలు సేకరించి బాధితులను ఆదుకోవడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. 40 క్వింటాళ్ల బియ్యం, కందిపప్పు, పామాయిల్ను బాధితుల కోసం పంపారన్నారని జీవీ తెలిపారు.
విరాళాలు సేకరించిన బొల్లాపల్లి కోటేశ్వరరావు, సుభాని, జానీబాషా, మన్నెయ్య, వెంకటేశ్వర్లు, బాలాజీ నాయక్, షేక్ మౌలాలి, రంగయ్య, తదితరులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు జరపాల గోవింద నాయక్, పెమ్మసాని నాగేశ్వరరావు, ఆరెకట్ల వాసుదేవరెడ్డి, తిప్పిశెట్టి వెంకటేశ్వర్లు, ఎలిశెట్టి రంగయ్య, హనుమా నాయక్, బా రెడ్డి వెంకటేశ్వర రెడ్డి, కోటేశ్వరరావు, ఏడుకొండలు, రామచంద్రయ్య, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.