విలేజ్ క్లినిక్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య

జగ్గయ్యపేట, మహానాడు: జగ్గయ్యపేట మండలం బలుసుపాడు గ్రామంలో గ్రామస్తులు బద్దుల వెంకటరామయ్య, వెలమాటి చంద్రమౌళి, గ్రామ తెలుగుదేశం పార్టీ సహకారంతో ఏర్పాటు చేసిన విలేజ్ క్లినిక్ ను శాసనసభ్యుడు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తాతయ్య గారు మాట్లాడుతూ గ్రామంలో ప్రజలు ఆరోగ్య సమస్యలకు, గర్భిణులకు, పిల్లలకు వ్యాక్సిన్లు కొరకు ఉపయోగించుకోవాలని తెలిపారు. పేదలకు వైద్య సేవలు అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ స్రవంతి, డాక్టర్ వెంకట్రావు, వనజాక్షి, గ్రామ నాయకులు పాల్గొన్నారు.