– కలెక్టర్లతో సీఎం చంద్రబాబు
విజయవాడ, మహానాడు: ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలపై మరింత అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తొమ్మిదో రోజు చేపడుతున్నసహాయక చర్యలు, భారీ వర్షాలు ఉన్న ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో పరిస్థితులపై కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం టెలీకాన్ఫరెన్స్ లో సమీక్షించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, తూర్పుగోదావరి కలెక్టర్లతో సీఎం మాట్లాడి, పలు సూచనలు చేశారు. ఇంకా.. ఆయన ఏమన్నారంటే…
– బుడమేరు వరద నీటి ప్రభావం కొంత మేరకు తగ్గింది.
-సాయంత్రానికి దాదాపు అన్ని ప్రాంతాలు నీటి నుంచి బయట పడతాయి.
• వాహనాలు, వ్యక్తులు వెళ్లలేని ప్రాంతాల్లో డ్రోన్స్ ను ఉపయోగించండి.
• కాలువల్లో వరద ప్రవాహాలు, గట్లు పటిష్ఠతను డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు అంచనా వేయండి
• విజయవాడలో కొన్ని ఇళ్ళు మినహా విద్యుత్ పునరుద్దరణ పూర్తి అయ్యిందని తెలిపిన అధికారులు
• అంటువ్యాధులు ప్రబలకుండా పూర్తి స్థాయిలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలి
– మెడికల్ క్యాంపులు కొనసాగించాలని సూచన
• వరద ప్రభావిత ప్రాంతాల్లో మిగిలిన అయిదు టవర్ల పరిధిలో కూడా సిగ్నల్స్ పునరుద్ధరణ త్వరగా చేపట్టాలి
• ఎర్రకాల్వకు వదర ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. డ్రోన్ ద్వారా బ్రీచ్ పాయింట్స్ కూడా గుర్తించాలి
• ఏలేరు రిజర్వాయర్ లోకి వచ్చే ఇన్ ఫ్లో…అవుట్ ఫ్లో బ్యాలెన్స్ చేసుకోవాలి.
• ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించవచ్చు.
• ఏలేరు రిజర్వాయర్ కెనాల్స్ పరిధిలో గండ్లు పడే అవకాశం ఉన్న మూడు ప్రదేశాలను గుర్తించామని సీఎం దృష్టికి తీసుకొచ్చిన కలెక్టర్. తక్షణమే మరమ్మతులు చేయాలని ఆదేశించిన సీఎం
• ధవళేశ్వరం వద్ద నిన్న మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశామని, నీటి ప్రవాహం తగ్గడంతో అది ఉపసంహరించామని సీఎంకు తెలిపిన తూర్పుగోదావరి కలెక్టర్.
• విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితిని ముఖ్యమంత్రికి వివరించిన కలెక్టర్లు.