హైదరాబాద్, మహానాడు : జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ శనివారం పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి 2:3 మెజారిటీ లేకుండా సింగిల్ గా కండువాలు కప్పి చేర్చుకుంటున్నారని పేర్కొన్నారు. సరైన మెజారిటీ లేకుండానే మేయర్, డిప్యూటీ మేయర్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. రాజ్యాంగ విరుద్ధంగా పార్టీలో చేర్చుకోవడం వల్ల ఈరోజు కౌన్సిల్లో గందరగోళం నెలకొంది.మాకు ఎవరూ టచ్ లో లేరు.. చేర్చుకునే ఆలోచన మాకు లేదు. జీహెచ్ఎంసీలో సమస్యలు పెరిగిపోయాయి. కౌన్సిల్ పరిస్థితులు చూస్తుంటే భవిష్యత్తులో మరీ దారుణంగా తయారయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఎవరికో పుట్టిన బిడ్డను ముద్దాడినట్లు ఉంది కాంగ్రెస్ పరిస్థితి అని ఈటెల ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు.