ఖమ్మం బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థిగా నామా నామినేషన్‌

ఖమ్మం, మహానాడు : ఖమ్మం బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు బుధవారం కలెక్టరేట్‌లో రిటర్నింగ్‌ అధికారి వి.పి.గౌతమ్‌కు నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన వెంట మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎమ్మెల్సీ తాతా మధు, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఉన్నారు.