పోలీస్ కస్టడీకి నందిగం సురేశ్

– అనుమతించిన కోర్టు

మంగళగిరి, మహానాడు: నందిగం సురేశ్ ను పోలీస్ కస్టడీకి స్థానిక కోర్టు అనుమతి మంజూరు చేసింది. రెండు రోజులపాటు సురేష్ ను పోలీసులు విచారిస్తారు. ఈ నెల 15 నుంచి 17 వరకు సురేష్ విచారణకు కోర్టు అనుమతి ఇచ్చింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్ ను పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నందిగం సురేష్ ను మంగళగిరి గ్రామీణ పీఎస్ లోనే విచారణకు కోర్టు అనుమతి ఇచ్చింది.