ఉండవల్లి: సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో ఉండవల్లిలోని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసంలో సంబరాలు మిన్నంటాయి. నారా, నందమూరి కుటుంబసభ్యులు, బంధువులు కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మనవడు దేవాన్ష్ కేక్ కట్ చేసి చంద్ర బాబుకు, బంధువులకు కేక్ తినిపించారు.