Mahanaadu-Logo-PNG-Large

రామోజీ అంతిమయాత్రలో నారా లోకేష్‌

అమరావతి: రామోజీరావు అంతిమయాత్రలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామోజీరావు నాకు మార్గదర్శకులు. రైతు కుటుంబం నుంచి అధికార పార్టీలను ప్రశ్నించే స్థాయికి వచ్చిన రామోజీరావుది ఓ చరిత్ర. నా లాంటి యువతకు ఆయన స్ఫూర్తి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజల గొంతు వినిపించే తత్వం ఆయనది. ప్రజా వ్యతిరేక విధాన నిర్ణయాలు ఏ ప్రభుత్వం తీసుకున్నా సహించేవారు కాదు. ఏ రంగంలో చేయి పెడితే ఆ రంగాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దారు. ప్రజలకు అండగా ఉండి సేవ చేస్తూ వారి జీవితాల్లో మార్పు తీసుకురమ్మని నాకు నిత్యం ఇచ్చే సూచన ఎప్పటికీ మరువను. రామోజీరావు మన మధ్య లేక పోవడం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు.