కోవిడ్ కంటే డేంజర్ నిఫా వైరస్!

అమరావతి, మహానాడు :  కేరళలో నిఫా వైరస్ కలకలం రేపుతోంది. ఈ వైరస్ జంతువుల నుంచి నేరుగా మనుషులకు సోకుతుంది. ‘ఫ్రూట్ బ్యాట్స్’ అనే గబ్బిలాలు వాలిన పండ్లను తీసుకోవడం ద్వారా వైరస్ మనుషుల్లోకి ప్రవేశిస్తుంది. రోగి నుంచి వెలువడే స్రావాల ద్వారా కూడా ఇతరులకు వ్యాపిస్తుంది. జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వాంతులు, గొంతు బొంగురు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. నిఫా సోకిన వారిని ఐసోలేషన్లో ఉంచుతారు. ఇది కొవిడ్ కంటే డేంజర్ అని వైద్య నిపుణులు చెబుతున్నారు.