– అధికారపార్టీ అక్రమాలకు సహకరించిన ప్రతీ అధికారిపై చర్యలు తీసుకోండి
– కేంద్ర ఎన్నికల ప్రధానాధికారికి తెదేపా నేత వర్ల రామయ్య లేఖ
• 2023 మార్చిలో జరిగిన మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అక్రమాలపై పిర్యాదు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారపార్టీ నాయకులు అధికారుల సహకారంలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు.గ్రాడ్యుయేట్లు కానివారిని సైతం గ్రాడ్యుయేట్లుగా ఓటు హక్కు కల్పించి బోగస్ ఓట్లు వేసుకున్నారు. కానీ, అక్రమాలకు పాల్పడిన అధికారపార్టీ నేతలపై గానీ, అధికారులపై గానీ నేటికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. గ్రాడ్యుయేట్ ఎన్నికల అక్రమాలపై ప్రతీ పిర్యాదుతోపాటు ఆధారాలను సైతం ఎలక్షన్ కమీషన్కు పంపాం. ఓ పిర్యాదుపై మాత్రం ఐపీసీ సెక్షన్ 171 డి, రిప్రజెంటేషన్ ఆప్ పీపుల్స్ యాక్ట్ – 1950 ప్రకారం ఇద్దరు తిరుపతి మునిసిపల్ కార్పొరేటర్లపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. కానీ, ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
దొంగ సర్టిఫికేట్లతో గ్రాడ్యుయేట్లుగా సర్టిఫై చేసి ఓటు హక్కు కల్పించిన ఈఆర్ఓ, ఏఈఆర్ఓలుపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మేము అడిగిన గ్రాడ్యుయేట్లు కాని ఎంతమంది గ్రాడ్యుయేట్లు ఓటు హక్కు పొందారన్న సమాచారం మాకు నేటికి ఇవ్వలేదు. అధికారపార్టీ నాయకులతో కుమ్మక్కై బోగస్ ఓట్లు నమోదు చేసి ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కిన అధికారులపై చర్యలు తీసుకోవాలని మరోసారి కోరుతున్నాం. తిరుపతి ఉపఎన్నికల్లో గిరీషాతో పాటు అనేకమంది అధికారులు, అధికారపార్టీ నేతలు ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారు. గ్రాడ్యుయేట్ ఎన్నికలతో పాటు అన్నీ ఎన్నికల్లో అధికారపార్టీ అక్రమాలకు సహకరించిన ప్రతీ అధికారిపై చర్యలు తీసుకోండి.