Mahanaadu-Logo-PNG-Large

గొట్టిపాటి లక్ష్మి కోసం ఎన్‌ఆర్‌ఐల ప్రచారం

దర్శి, మహానాడు : దర్శి మండలం మారెడ్డిపల్లి, చందలూరు, పులిమివారిపల్లి, బట్టువారిపల్లి, చందలూరు ఎస్సీ కాలనీ, లింగన పాలెం, తుమ్మెదలపాడు గ్రామాలలో దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు రావాలి మా యువతకు భరోసా కావాలి అన్న నినాదంతో రూపొందించిన టీడీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం పోస్టర్‌ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దాసరి. రమేష్‌ పాల్గొన్నారు. యూఎస్‌, యూకే నుంచి బాబు గెలుపు కోసం మా భవిష్యత్‌ కోసం ఎన్నికల ప్రచారానికి వచ్చామని, దర్శిలో గొట్టిపాటి లక్ష్మి గెలుపు లక్ష్యంగా ప్రచారం చేస్తున్నట్లు వివరించారు.

ప్రజలకు నమ్మకం కలిగించిన ఒక డాక్టర్‌గా, తమ ఇంటి ఆడబిడ్డగా ప్రజలు టీడీపీ అభ్యర్థికి బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు. దర్శి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చంద్రబాబు ఇచ్చిన మాట ప్రజల్లో నమ్మకాన్ని కలిగించిందని, సైకిల్‌కు ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మి ప్రచారంలో పాల్గొన్న ఎన్‌ఆర్‌ఐలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.