ఎన్టీఆర్‌ హుకుం..ఇందిర హడల్‌..

-ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ నిమిషాల్లో ఖాళీ
-అదీ ఆత్మగౌరవం అంటే..అదీ తెలుగువారంటే…

1983లో ఎన్టీఆర్‌ పార్టీ పెట్టి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఢిల్లీకి కర్టసీ కోసం ప్రధానమంత్రి ఇందిరాగాంధీని కలవడానికి వెళ్లారు. అధికారులు తమిళ నాడు భవన్‌లో బస ఏరాటు చేశారట. అదేంటి మనకు ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ లేదా అని రామారావు అడిగారట. ఉంది ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ కాంగ్రెస్‌ నాయకులు, రౌడీలు ఆక్యుపై చేశారు అని చెప్పారట. అయితే వాళ్లను ఖాళీ చేయించండి అన్నారట రామారావు గారు. అది అంత ఈజీ కాదు. కరుడు కట్టిన నేరస్తులు వాళ్లు అని అధికారులు చెప్పారట. అప్పుడు ప్రధానమంత్రి ఆఫీసుకు ఫోను కలపం డి అని రామారావు అడగటంతో అధికారులు భయపడ్డారట. నో..వెంటనే కలపండి అని హుకుం జారీ చేశారట. అప్పుడు రామారావు 48 గంటలు సమ యం ఇస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ను ఖాళీ చేయించి మాకు అప్పజెప్పమని వార్నింగ్‌ ఇచ్చారు. ఆ దెబ్బకు ప్రధానమంత్రి ఆఫీసు విస్తుపోయింది అట. ఓ దక్షిణాది ముఖ్యమంత్రి వచ్చి ఢిల్లీలో ఇలా మాట్లాడటం ఇదే మొదటిసారి అని ఆశ్చర్యపోయారట. వెంటనే ప్రధానమంత్రి ఇందిరాగాంధీతో మాట్లాడి మిలటరీ సహాయంతో ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ను ఖాళీ చేయించి 48 గంటలలో అప్పజెప్పారట. తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిని కలవకముందే జరిగిన సంఘటన ఇది. అదీ ఎన్టీఆర్‌ అంటే.. అదీ ఆత్మగౌరవం అంటే.. ఢిల్లీలో, భారతదేశానికి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు వారు అని ఒకరు ఉన్నారు అని తెలియజేసిన మహానుభావుడు నందమూరి తారకరామారావు. అలాంటి మహానుభావులను తలుచుకోవడం మన అదృష్టం.