అమరావతి: ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా చిరంజీవి ట్వీట్ చేశారు. కొందరి కీర్తి అజరామరం. తరతరాలు శాశ్వతం. భావితరాలకు ఆదర్శం. నంద మూరి తారక రామారావును ఈ రోజు గుర్తుచేసుకుంటూ వారు ప్రజా జీవితంలో చేసిన సేవలకు భారతరత్న పురస్కారం సముచిత గౌరవం అని భావిస్తున్నాను. తెలుగు వారి ఈ చిరకాల కోరికని కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నాను అని ట్వీట్లో పేర్కొన్నారు.