-ఫైల్స్, సామగ్రి తరలింపుపై నిషేధం
-సాధారణ పరిపాలనా శాఖ ఆదేశాలు
అమరావతి: రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్ అనంతరం కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ఈ మేరకు మంత్రుల బాంబర్లు, సహాయకులను అప్పగించాలని సాధారణ పరిపాలనా శాఖ ఆదేశాలు జారీ చేసింది. మంత్రుల చాంబర్ల నుంచి ఎటువంటి ఫైల్స్, ఇతర సామాగ్రి తరలించటంపై నిషేధం విధించినట్లు తమ ఉత్తర్వులలో పేర్కొన్నారు.