పదకొండోనంద స్వామి జగన్

-తిరుపతిలో అక్రమాలపై విచారణ చేపట్టాలి 
-8న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం
-బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ 

విజయవాడ, మహానాడు : మాజీ ముఖ్యమంత్రి జగన్ పదకొండో నంద స్వామి గా అవతరించారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ అన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తప్పుచేసి జైలు కెళ్తే మాజీ ముఖ్యమంత్రి పదకొండోనంద స్వామిగా వేదాలు చెబుతున్నారన్నారు. ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని విద్వాంసకర, అరాచక పాలన చేసి ఇప్పుడు కొత్త అవతారం ఎత్తాడని ఎద్దేవా చేశారు. అరాచక పాలనలో జగన్ మూడు అంకెల సంఖ్య నుండి రెండు అంకెల స్థానానికి పడిపోయాడు. ఇప్పటికైనా తన ప్రవర్తనలో మార్పు రావాలని శ్రీనివాస్ ఆకాక్షించారు.  ఈ సందర్భంగా ఆయన పలు అంశాల గురించి మాట్లాడారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ఎన్డీయే కూటమి కృషి చేస్తోందన్నారు. టీటీడీ కేంద్రంగా శ్రీవారి ఆస్తులు, నిధులను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి  దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఉద్యోగులకు ఇళ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయన్నారు.

టీటీడీ లో షాపుల లైసెన్స్ లలో గోల్ మాల్ చేయటంలో వైసీపీ కీలక పాత్ర వహించిందన్నారు. టీటీడీలో 16 మందిని ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా పని చేసినందుకు లైసెన్స్ ప్రొసీడింగ్స్ వ్యవహారం కీలకంగా మారిందన్నారు. భూమన ఇంటికి పిలిపించి పాత తేదీలు వేసి సంతకం చేసి గోల్ మాల్ చేశారు. వీటన్నిటిపై విజిలెన్స్ ఎంక్వయిరీ వేయాలని ప్రస్తుత ఈఓని కోరారు. వకుళ మాత రెస్ట్ హౌస్ కి కొన్ని దుకాణాలను అనధికారికంగా మార్చుదామని చూసిన భూమన పై విజిలెన్స్ ఎంక్వయిరీ వేయాలన్నారు. నేర ప్రవృత్తిలో మార్పు తీసుకొచ్చేందుకు బాధితులకు సత్వర న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వం సరికొత్త న్యాయ చట్టాలని తీసుకురావటం శుభదాయకం. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాక రాజమండ్రిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈనెల 8న నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ అన్నారు. ఈ విస్తృత స్థాయి కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, బీజేపీ నాయకులు హాజరవుతారన్నారు.