చంద్రబాబు, పవన్ చిత్రపటాలకు పాలాభిషేకం

వినుకొండ, మహానాడు: వినుకొండ పట్టణంలోని భవన నిర్మాణ కార్మికులతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు పాలాభిషేకం చేశారు. ఉచిత ఇసుక పథకం అమలు సందర్భంగా భవన నిర్మాణ కార్మికులతో కలిసి పట్టణంలోని ఏనుగుపాలెం రోడ్ లో పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, సీపీఐ నాయకులు షైదా, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.