అమరావతి, మహానాడు : పోలీసుల సమస్యల పరిష్కారించాలని టీడీపీ నాయకులు మహ్మద్ ఇక్బాల్, ఎం.ఎస్.బేగ్ శుక్రవారం డీజీపీని కలిసి వినతిపత్రం అందజేశారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న పోలీసులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలో పోలీసులకు తగిన బాధ్యతలు అప్పగించాలని, ఎలక్షన్ డ్యూటీలో ఉన్న పోలీసులకు అలవెన్స్ లు సకాలంలో అందించాలని విజ్ఞప్తి చేశారు. బందోబస్తులో పాల్గొంటున్న పోలీసు లు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని వాటిపై దృష్టిపెట్టాలని కోరారు.