Mahanaadu-Logo-PNG-Large

చంద్రబాబును కలిసిన పిన్నెల్లి బాధితుడు మాణిక్యాలరావు

-తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆవేదన
-పార్టీ అండగా ఉంటుందని బాబు భరోసా

హైదరాబాద్‌: టీడీపీ అధినేత చంద్రబాబును మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృ ష్ణారెడ్డి బాధితుడు నోముల మాణిక్యాలరావు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో గురువారం కలిశారు. పిన్నెల్లి సోదరుల అరాచకాన్ని బయటపెట్టాక తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పిన్నెల్లి సోదరుల అరాచకాలపై మీడియాతో మాట్లాడటం, పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినప్పటి నుంచి మరింత కక్షగట్టారని వివరించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్యే సోదరుడు తనను, తన కుటుంబాన్ని అంతమొందించేందుకు ప్రైవేటు సైన్యాన్ని ఉసిగొల్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణభయంతో ప్రస్తుతం హైదరాబాద్‌లో తలదాచుకున్నానని, సాక్షాత్తు డీజీపీకి కూడా మొరపెట్టుకున్నానని వివరించారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన చంద్రబాబు ఆయన పోరాటాన్ని అభినందించారు.