Mahanaadu-Logo-PNG-Large

నేడు ఇటలీకి ప్రధాని మోదీ

జీ-7 దేశాల 50వ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఇటలీ వెళ్లనున్నారు. మూడోసారి పీఎం పదవి చేపట్టిన అనంతరం మోదీ తొలి విదేశీ పర్యటన కానుంది.

ఈ సమావేశాలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, జపాన్ పీఎం ఫ్యూమియో కిషిడా, తదితరులు హాజరు కానున్నారు.

మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సులో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, గాజా సంఘర్షణలపై చర్చించనున్నారు.