నరసరావుపేట: ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో నరసరావుపేట పట్టణంలో ఐజీ త్రిపాఠి ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ ఆధ్వర్యంలో పోలీసులు, కేంద్ర బలగాలతో బుధవారం కవాతు నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తూ కౌంటింగ్ సమయంలో ప్రజలు అల్లర్లకు పాల్పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లాలో బాధ్యత లు నిర్వహిస్తున్న ఎస్పీ సురేష్బాబు, అడిషనల్ ఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో పాటు కేంద్ర బలగాలు సిబ్బంది పాల్గొన్నారు.