– పోలీస్ అమరవీరుల దినోత్సవంలో ఎస్పీఎఫ్ కమాండెంట్ శంకర్రావు
గుంటూరు, మహానాడు: పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్బంగా ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ త్రివిక్రమ్ వర్మ ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ జనరల్ బీవీ రామి రెడ్డి ఆధ్వర్యంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అధికారులు, సిబ్బంది అమరవీరులకు రెండు నిమిషాల మౌనం పాటిస్తూ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విజయవాడ జోన్ ఎస్పీఎఫ్ కమాండెంట్ ముద్దాడ శంకర్రావు మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీస్ సిబ్బంది చేసే త్యాగాలు మరువలేనివని, సిబ్బంది సేవలను ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలని, వ్యక్తిగత జీవితం కంటే తమ విధులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని తెలిపారు.