డీజీపీకి సిట్‌ బృందం ప్రాథమిక నివేదిక

-రాష్ట్రంలో హింసాత్మక ఘటనలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు
-33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు గుర్తించిన విచారణ బృందం
-నిన్న అర్ధరాత్రి వరకు ఆయా ప్రాంతాల్లో కొనసాగిన సిట్‌ పర్యటనలు
-నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను పరిశీలించిన అధికారులు
-సీఈవో, సీఈసీకి నివేదికను పంపనున్న ప్రభుత్వం
-మరికొందరు అధికారులపై కేసులు పెట్టే అవకాశం

అమరావతి, మహానాడు: రాష్ట్రంలో ఎన్నికల రోజు, ఆ తర్వాత జరిగిన హింసపై ప్రాథమిక నివేదికను సిట్‌ బృందం సోమవారం డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తాకు అందజేసింది. పోలింగ్‌ రోజు 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు ప్రత్యేక విచారణ బృందం గుర్తిం చింది. దమనకాండపై రెండ్రోజుల పాటు సిట్‌ అధికారులు ఆయా నియోజ కవర్గాల్లో విచారణ చేపట్టారు. అల్లర్లు జరిగిన ప్రాంతాలకు వెళ్లి స్థానిక పోలీసు లు, నేతలు, వివిధ వర్గాల ప్రజల నుంచి సమాచారం సేకరించారు. హింసాత్మక ఘటనలపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను పరిశీలించారు. ఆదివారం అర్థరాత్రి వరకు ప్రత్యేక విచారణ బృందం దర్యాప్తు కొనసాగింది. ఈ అంశాలన్నింటినీ క్రోడీకరిం చిన సిట్‌ అధికారులు ప్రాథమిక నివేదికను రూపొందించి డీజీపీకి అందించారు.

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో 13 మంది సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటైన విషయం తెలిసిందే.

150 పేజీలతో నివేదిక

పల్నాడు, తాడిపత్రి, మాచర్ల, నరసరావుపేట, తిరుపతి, చంద్రగిరి హింసాత్మక ఘటనల్లో ప్రతి అంశంపైనా కేసు నమోదు చేసేలా చూడాలని అవసరమైతే కొన్ని అదనపు సెక్షన్లను సైతం జోడిరచాలని ఇప్పటికే డీజీపీ ఆదేశించారు. ఎన్నికల రోజు, తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై 150 పేజీలతో కూడిన నివేదికను డీజీపీకి అందించారు. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో 33 ఘటనలు నమోదైనట్లు సిట్‌ తేల్చింది. హింసాత్మక ఘటనలపై నమోదైన ఎఫ్‌ఐ ఆర్‌లను సైతం విచారించారు. స్థానికులు, పోలీసులను కూడా విచారించిన సిట్‌ బృందం, ఎఫ్‌ఐఆర్‌లలో కొత్త సెక్షన్లు చేర్చే విషయంపై సిఫార్సు చేశారు. కొత్తగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాలా? వద్దా? అనే అంశంపై నిర్ణయం తీసుకున్నారు.

మరికొందరు అధికారులపై కేసులు పెట్టే అవకాశం

హింసాత్మక ఘటనలు జరుగుతాయని తెలిసీ కొందరు నిర్లక్ష్యం చేశారని సిట్‌ బృందం పేర్కొంది. స్థానిక నేతలతో పోలీసులు కుమ్మక్కయ్యారు. హింసాత్మక ఘటనలు జరుగుతున్నా పోలీసులు నిర్లక్ష్యం వహించారని తెలిపింది. కాగా హింసత్మక ఘటనలకు సంబంధించి కొందరు అధికారులపై కేసులు పెట్టే అవకాశం ఉంది. కాసేపట్లో సీఈవో, సీఈసీకి సిట్‌ నివేదికను ప్రభుత్వం పంప నుంది. సిట్‌ నివేదిక ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం తదుపరి చర్యలు తీసుకోనుంది.