కారణజన్ముడు మహమ్మద్ ప్రవక్త

– కాకినాడ శాసనసభ్యులు వనమాడి కొండబాబు

కాకినాడ: ప్రపంచంలో శాంతిపూర్వక మానవ సమాజాన్ని నెలకొల్పేందుకు తన జీవితాన్ని అంకితం చేసిన కారణజన్ముడు మహమ్మద్ ప్రవక్త అని కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు.

మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా కాకినాడ నగరంలో ముస్లిం సోదరులు నిర్వహించిన ర్యాలీలో వనమాడి కొండబాబు పాల్గొని ముస్లిం సోదరులకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలియజేసి స్వీట్స్ పంపిణీ చేశారు. ముందుగా మత గురువు ఇమామ్ కు సాలువ వేసి సత్కరించారు.