– ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యమిస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి
నిడదవోలు: ప్రజారోగ్యం ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. సోమవారం ఉదయం నిడదవోలులో స్వచ్ఛత హీ సేవా -2024 కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు.
వైద్య శిబిరంలో ఏర్పాటు చేసిన స్వయంగా పరిశీలించిన మంత్రి దుర్గేష్ ప్రత్యక్షంగా వైద్యులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రజలందరి ఆరోగ్య రక్షణ కోసం నిడదవోలులో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు.
నిడదవోలు నియోజకవర్గ ప్రజల రుగ్మతలను, ఇతరత్రా వైద్య సమస్యలను నయం చేసేందుకు స్థానిక డాక్టర్లే కాకుండా ఇతర ప్రాంతాల నుండి వివిధ విభాగాల వైద్యులు, పారామెడికల్ సిబ్బంది వచ్చారని మంత్రి తెలిపారు.