విజయవాడ, మహానాడు: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఏపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఏ) ఇండియా రీజియన్ ప్రతినిధిగా, కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ సభ్యురాలిగా నామినేట్ అయ్యారు. ఈమేరకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఉత్తర్వులు ఇచ్చారు. 2026 చివరి వరకు ఈ నియామకం వర్తిస్తుంది. సీపీఏ ఇండియా రీజియన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలుగానే కాకుండా మహిళా పార్లమెంటేరియన్ల స్టీరింగ్ కమిటీకి చైర్పర్సన్గా కూడా ఆమె వ్యవహరిస్తారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.