పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి పట్టణం ఒకటవ వార్డు రంగా కాలనీలో ముస్లీం మైనార్టీ నాయకుల ఆహ్వానం మేరకు గురువారం టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. స్వయంగా ఇఫ్తార్ విందును వడ్డిస్తూ అందరినీ పలకరించారు. ముస్లీం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ మైనార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.