ఏపీలో డిసెంబర్‌ నుంచి రిజిస్ట్రేషన్లు మరింత భారం?

– రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ కసరత్తు మొదలు

అమరావతి, మహానాడు: ఏపీలో డిసెంబరు 1వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు మరింత భారం కానున్నట్టు తెలుస్తోంది. ఆస్తుల క్రయ, విక్రయాల రిజిస్ట్రేషన్ విలువలను పెంచాలని ప్రభుత్వ సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. గడచిన రెండు నెలలుగా జిల్లా సంయుక్త కలెక్టర్ స్థాయిలో కమిటీలు ఏర్పాటుచేసి రిజిస్ట్రేషన్ విలువల పెంపుపై రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ కసరత్తు చేస్తోంది. ఈ నివేదికను సీఎం ఆమోదిస్తే కొత్త రిజిస్ట్రేషన్ విలువలపై అధికారికంగా ప్రకటన వెలువడనుంది. కనిష్ఠంగా 10% నుంచి గరిష్ఠంగా 20% వరకు రిజిస్ట్రేషన్ విలువలు పెరిగే అవకాశం ఉందంటున్నారు.