Mahanaadu-Logo-PNG-Large

ఏపీకి ‘రెమాల్‌’ తుఫాన్‌ హెచ్చరిక

అమరావతి: నైరుతి పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. శుక్రవారం నాటికి వాయుగుండంగా మారి ఆ తర్వాత ఈశాన్యంగా పయనించి శనివారం ఉదయానికి తూర్పు మధ్య బంగాళా ఖాతంలో తుఫాన్‌గా మారనుంది. దీనికి ‘రెమాల్‌’ అని పేరు పెట్టారు. ఈ తుఫాన్‌ మరింత బలపడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో ఏపీలో ఆది, సోమవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.