పల్నాడు జిల్లాలో 304 మంది వాలంటీర్ల రాజీనామా

పల్నాడు జిల్లా, మహానాడు: పల్నాడు జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 304 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా విధుల నుంచి తప్పుకుని రాజీనామా చేశారని జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ తెలిపారు. రాష్ట్ర సచివాలయం నుంచి ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీసు సూపరింటెండెంట్లు, పోలీసు కమిషనర్లతో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ వివరాలు వెల్లడిరచారు. ఈ కాన్ఫరెన్స్‌లో జిల్లా ఎస్పీ బిందు మాధవ్‌, జేసీ ఏ.శ్యాంప్రసాద్‌, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.