Mahanaadu-Logo-PNG-Large

వర్షాకాలం జాగ్రత్తలపై రేవంత్‌రెడ్డి సమీక్ష

హైదరాబాద్‌, మహానాడు : కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో పోలీసు, ఇతర విభాగాల అధికారులతో ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. రాబోయే వర్షాకాలానికి సంబంధించి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై చర్చించారు. ఈ సమావేశం లో పోలీస్‌, ట్రాఫిక్‌, జీహెచ్‌ఎంసీ, విద్యుత్‌, వాతావరణ శాఖ అధికారులతో పాటు ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.