Mahanaadu-Logo-PNG-Large

ఒకే కుటుంబంలో నలుగురి దుర్మరణం

-కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
-కారు అదుపుతప్పి లారీని ఢీకొనడంతో ఘటన
-మృతులంతా తమిళనాడుకు చెందిన వారిగా గుర్తింపు

గన్నవరం, మహానాడు: కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడు హెచ్‌పీ పెట్రోల్‌ బంకు సమీపంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టడంతో నలుగురు అక్కడిక్కడే దుర్మరణం చెందగా మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న హనుమాన్‌ జంక్షన్‌ సీఐ అల్లు లక్ష్మీనరసింహ మూర్తి, వీరవల్లి ఎస్‌ఐ చిరంజీవి తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. కొవ్వూరు నుంచి తమిళనాడుకు కారులో వెళుతుతుండగా ఈ ప్రమాదం జరిగింది. తమిళనాడులో ఒకే కుటుంబా నికి చెందిన స్వామినాథన్‌ (40), రాకేష్‌(12), రాధప్రియ(14), గోపి(23) అక్కడి క్కడే మృతిచెందగా మృతుడు స్వామినాథన్‌ భార్య సత్య(28) తీవ్రంగా గాయపడ్డా రు. ఆమెను నిమిత్తం అంబులెన్సులో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించా రు. రహదారిపై ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా నుజ్జునుజ్జయిన కారును హైవే పెట్రోలింగ్‌ సిబ్బంది పక్కకు తీయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.