-దోచుకోవడమే సీఎస్ జవహర్రెడ్డి పని
-బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్నాయుడు
విజయవాడ: బీజేపీ ఏపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్నాయుడు గురువారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. సీఎస్ జవహర్రెడ్డి పాపాలు క్షమించరాని విధంగా తన ప్రవర్తన ఉంటుంది. భూములు, మైనింగ్ ఇలా అన్ని దోచుకోవటమే పని. రాష్ట్రంలో రాబోయేది కూటమి ప్రభుత్వమే సజ్జల రామకృష్ణారెడ్డి పోలింగ్ రోజు దొంగ ఓట్లు వేయటానికి వేసిన వ్యూహనికి ఎన్నికల కమిషన్ చెక్ పెట్టింది. ఫలితాలు రోజు అల్లర్లు సృష్టించటానికి వైసీపీ సిద్ధం అవుతుంది. వాటిని కట్టడించేందుకు ఈసీ చర్యలు తీసుకుంటుంది. జగన్ చేసిన అవినీతి పాలనపై రాబోయే కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ను కూటమి నాయకత్వంలో అభివృద్ధి దిశగా తీసుకెళుతారని పేర్కొన్నారు.