సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ
సత్తెనపల్లి, మహానాడు: నకరికల్లు మండలం నకరికల్లు అడ్డరోడ్డు, చల్లగుండ్ల గ్రామాలలో శుక్రవారం టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగన్రెడ్డి విధ్వంస పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కూటమి అధికారంలోకి వస్తుందన్నారు. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన జగన్ మద్యం నిషేధం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ప్రత్యేక హోదా, పోలవరం, 23 వేల పోస్టులతో మెగా డీఎస్సీ అంటూ మాట తప్పారని విమర్శించారు. జగన్ రెడ్డికి కౌంట్డౌన్ మొదలైం దన్నారు. ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుమరుగు కానుందని అన్నారు. ఒక ప్రాజెక్టు కూడా పూర్తి చేయకుండా రైతులను సాగునీటికి ఇబ్బందులకు గురిచేశాడని ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా కొత్త కొత్త పన్నులు వేసి ధరలు పెంచి ప్రజల రక్తాన్ని జలగలా పీల్చేచేస్తున్నాడని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.