Mahanaadu-Logo-PNG-Large

నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్‌

-కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత
-ఉన్నతాధికారుల కోసం ప్రత్యేక సెల్‌
-మానిటరింగ్‌ బృందాలతో నిరంతరం నిఘా

అమరావతి : కౌంటింగ్‌ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలలో భాగంగా పలుచోట్ల రౌడీషీటర్లు, ట్రబుల్‌ మంగ్ల్‌ యాక్టివిటీస్‌ కలిగిన వారికి పోలీసుశాఖ తగు హెచ్చరికలు జారీ చేసింది. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవడానికి లేకుండా పటిష్టమైన భద్రతా బలగాలను మోహరించారు. ఏ చిన్న సంఘటన చోటు చేసుకున్నా వెంటనే తదుపరి ఆదేశాలకు ఉన్నతాధికారుల కోసం ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేశారు. ఆఘమేఘాలపై అక్కడి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఉత్తర్వులు అందచేసే విధంగా మానిటరింగ్‌ బృందాలతో నిరంత నిఘా ఉంచాలని సూచించింది. సెక్షన్‌ 40, 144 అమలులో ఉన్నందున ముగ్గురికి మించి ఉండటం నిషేధం. విజయోత్సవం చేయటంతో పాటుగా బాణసంచా కాల్పులు నిషేధం.

వీటిని అతిక్రమిస్తే ఎంతటి వారిపై అయిన చట్టప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఎన్నికల కౌంటింగ్‌ ముగిసిన తర్వాత పరిస్థితులను బట్టి మార్పు లు సడలింపులు ఉంటాయని పేర్కొంది.