ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీసీసీ చీఫ్ షర్మిల రేడియోను గిఫ్ట్గా పంపారు. “రాష్ట్ర ప్రజల మన్ కీ బాత్ను మోదీ వినాలి. ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్, పోలవరం, కడప ఉక్కు కర్మాగారం వంటి అంశాల్లో చేసిన అన్యాయంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇసుక, మద్యం, ఖనిజ అక్రమాలు జరుగుతున్నా కేంద్రం నుంచి చర్యలు లేవు. వివేకా హత్య కేసులో కేంద్రం పట్టనట్లు వ్యవహరించడం యావత్ దేశానికి అవమానం.” అని షర్మిల ధ్వజమెత్తారు.