వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా పనిచేయాలి

-బీజేపీ బలోపేతానికి కృషిచేయాలి
-ప్రజల్లోకి వెళ్లి కేంద్ర పథకాలు వివరించాలి
-పదాధికారుల సమావేశంలో మంత్రి సత్యకుమార్‌

విజయవాడ: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం పార్టీ పదాధికారుల సమావేశం జరిగింది. మంత్రి సత్యకుమార్‌ పాల్గొని దిశానిర్దేశం చేశారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వం చేసే మేళ్లు ప్రజలకు వివరించి చెప్పాలని సూచించారు. గెలిచిన శాసనసభ్యులు కూడా జిల్లాల్లోకి వెళ్లి పర్యటనలు చేయాలని, కార్యకర్తల కష్టాలు పట్టించుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, విశ్వ కర్మ లాంటి పథóకాలను వివరించి వికసిత ఆంధ్రప్రదేశ్‌ కోసం సమిష్టిగా పనిచేయాలని కోరారు. మోదీ ఆదర్శంగా అంత్యోదయ లక్ష్యంగా పనిచేయాలని, సాధారణ కార్యకర్తగా ఎదిగాను..ఇదే స్ఫూర్తితో పనిచేస్తే కార్యకర్తలకు భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ అధికార ప్రతినిధి ఆర్‌.డి. విల్సన్‌, నాయకులు, పదాధికారులు పాల్గొన్నారు.